News August 19, 2024
వెజ్ ఫుడ్ తింటున్నారా?

ఈ మధ్య కాలంలో చాలా మంది డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని తగ్గించుకునేందుకు శాకాహారం తినాలని HCU పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. నాన్ వెజిటేరియన్లతో పోలిస్తే శాకాహారుల్లో కుంగుబాటు, ఒత్తిడి తక్కువని పేర్కొన్నారు. వెజిటేరియన్లలో వ్యద్ధ్యాప్యం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్లు, పప్పులు భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దరి చేరవని గుర్తించారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.