News August 19, 2024

వచ్చే నెలలో రెండు కొత్త పథకాలు అమలు!

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు మరో రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే పనిలో పడింది. ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షల ఆర్థిక సాయంపై క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక రైతు భరోసా విషయంలోనూ మేధావులతో చర్చించి గైడ్‌లైన్స్ ఖరారు చేయనుంది. మరోవైపు రైతు కూలీలకు ఆర్థిక సాయంపైనా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.

Similar News

News July 8, 2025

ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ఫ్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 83,458 పాయింట్లు లాభపడగా, Nifty ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, NTPC, ఇండస్ ఇండ్, ICICI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News July 8, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ UPDATES

image

* కాసేపట్లో శ్రీశైలానికి ఏపీ సీఎం చంద్రబాబు, మ.12 గంటలకు డ్యామ్ గేట్ల ఎత్తివేత
* TG: పాశమైలారం సిగాచీ ఘటనలో 44కు చేరిన మరణాలు
* కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మృతిపై పవన్ సంతాపం
* YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల
* వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
* విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నేడు NIAకు బదిలీ
* కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు KTR.. భారీగా మోహరించిన పోలీసులు

News July 8, 2025

12లోగా MPTC స్థానాల తుది జాబితా

image

TG: MPTCల పునర్విభజనను జులై 12లోగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించింది. పలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో, కొన్ని పొరుగు పంచాయతీల్లో విలీనమవడం, జిల్లా మారడం వంటివి జరగడంతో డీలిమిటేషన్ చేయనుంది. ప్రతి మండలంలో కనీసం 5 MPTC స్థానాలు ఉండాలని, ఇవాళ ముసాయిదా స్థానాలు ప్రచురించాలని సూచించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించి 12న తుది జాబితాను ప్రకటించాలంది.