News August 19, 2024
అనురాగానికి ప్రతీక రక్షాబంధన్: మంత్రి కొల్లు

మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ అని వ్యాఖ్యానించారు. ప్రజలంతా తమ కుటుంబాలతో ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ పర్వదినాన్ని జరుపుకోవాలని మంత్రి ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News February 2, 2026
PGRS అర్జీలను వెంటనే పరిష్కరించండి: కృష్ణా కలెక్టర్

PGRSలో వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత సమయంలో పరిష్కరించి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన PGRSలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత శాఖల వారీగా పెండింగ్ అర్జీల పరిష్కార చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్ అర్జీలన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు.
News February 1, 2026
రేపు కలెక్టరేట్లో PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.
News February 1, 2026
కంకిపాడుకి చెందిన సినీ నటుడు రఘునాథ్ రెడ్డి మృతి

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.


