News August 19, 2024
మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలు

మిర్రర్ ఇమేజ్ తరహాలో పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం అందజేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని 890 బడుల్లో 8, 9 తరగతి వారికి రెండేళ్ల నుంచి వీటిని అందిస్తున్నారు. పుస్తకంలో తొలిపేజీ ఆంగ్లం.. రెండో పేజీ తెలుగు, మూడో పేజీ ఆంగ్లం నాలుగో పేజీ తెలుగు ఇలా పుస్తకాలను ప్రచురించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంగ్లిష్ను సులభంగా అర్థం చేసుకునేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు ఉపయెగపడుతున్నాయి.
Similar News
News November 3, 2025
HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
News November 3, 2025
మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News November 3, 2025
HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.


