News August 19, 2024

చిన్నారులు మృతి.. ఆదుకోవాలని జగన్ డిమాండ్

image

AP: అనకాపల్లి(D) కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు <<13890531>>మరణించడంపై<<>> వైసీపీ చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, స్కూళ్లలో పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. మరణించిన పిల్లల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బురదజల్లుడు కార్యక్రమాలు మానుకొని వ్యవస్థల పనితీరుపై దృష్టిసారించాలన్నారు.

Similar News

News November 4, 2025

పాక్ ప్లేయర్ హరీస్ రవూఫ్‌పై ఐసీసీ వేటు

image

ఆసియా కప్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన ఆటగాళ్లపై ICC చర్యలు తీసుకుంది. పాక్ ప్లేయర్‌ హరీస్ రవూఫ్‌పై 2 మ్యాచుల బ్యాన్ విధించింది. 24 నెలల వ్యవధిలో 4 డీమెరిట్ పాయింట్లు తెచ్చుకున్నందుకు ఈ వేటు వేసింది. 2 మ్యాచుల్లో 30% చొప్పున ఫీజులో కోత పెట్టింది. మరో ఆటగాడు ఫర్హాన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. ఇక <<17831364>>సూర్య<<>>కు మ్యాచ్ (14వ తేదీ) ఫీజులో 30% కోత, 2 డీమెరిట్ పాయింట్లను విధించింది.

News November 4, 2025

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలో ‘టైమ్ బ్యాంకు’

image

వృద్ధాప్యంలో ఆదుకొనేలా కేరళలోని కొట్టాయం(D) ఎలికుళం పంచాయతీ ‘టైమ్ బ్యాంక్’ అనే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ముందుగా యువత అక్కడి ఆఫీసులో నమోదవ్వాలి. స్థానిక వృద్ధులకు తోడుగా ఉంటూ సాయం చేయాలి. వారు సేవ చేసిన సమయం ఆ టైమ్ బ్యాంకులో జమ అవుతుంది. వారికి అవసరమైనప్పుడు ఆ పాయింట్ల ద్వారా సేవలు పొందొచ్చు. వలసలతో వృద్ధులు ఒంటరి వారవుతుండడంతో జపాన్ స్ఫూర్తితో దీన్ని అనుసరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News November 4, 2025

మీర్జాగూడ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణం: DGP

image

TG: మీర్జాగూడ బస్సు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని DGP శివధర్ రెడ్డి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఇవాళ ఆయన పరిశీలించారు. ‘ఇక్కడ రోడ్డు మలుపు ఉంది కానీ యాక్సిడెంట్ అయ్యేంత తీవ్ర మలుపు లేదు. దర్యాప్తులో అన్ని విషయాలు వెల్లడవుతాయి. టిప్పర్ కండిషన్‌ను పరిశీలిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలను ప్రభుత్వ పరంగా చూడకూడదు. అందరి బాధ్యతగా చూడాలి. డ్రైవర్లు డిఫెన్స్ కండిషన్‌ను అంచనా వేసుకోవాలి’ అని సూచించారు.