News August 19, 2024
KKR వదిలేస్తే నేనెళ్లే జట్టిదే: రింకూ సింగ్

ఒకవేళ కోల్కతా నైట్రైడర్స్ వదిలేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడటం ఇష్టమని యువ ఫినిషర్ రింకూసింగ్ అన్నారు. ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఉండటమే ఇందుకు కారణమన్నారు. స్పోర్ట్స్ తక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సూర్యకుమార్ కెప్టెన్సీ గురించి అడగ్గా అతడు ప్రశాంతంగా ఉంటాడని చెప్పారు. ఒత్తిడి లేకుండా సిక్సర్లు బాదేస్తుండటంతో రిటైరైన డీకే పాత్రకు రింకూ సరిపోతాడని RCB ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Similar News
News January 7, 2026
విశాఖ: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా?

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో నగరంలో నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబర్ నేరాలు, దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఊరు వెళ్లేటప్పుడు LHMS సేవలు వాడాలని, ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వాకింగ్కు వెళ్లే మహిళలు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, పనివారి వివరాలు సేకరించాలని, వాహనాలకు విధిగా తాళాలు వేయాలని స్పష్టం చేశారు.
News January 7, 2026
మెుక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి సహజ కషాయం

మొక్కజొన్న పంటను ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుల నిర్మూలనకు సహజ కషాయాన్ని రూపొందించారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివకృష్ణ. 200 లీటర్ల నీటిలో కిలో సర్ప్, అర కిలో పసుపును వేసి బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్కు రంద్రం చేసి మొక్కజొన్న మొక్క మొవ్వులో ఈ ద్రావణం వేయాలి. 25 రోజుల వయసున్న పైరులో మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
News January 7, 2026
T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్లు ఆడేందుకు ఇండియా రానుంది.


