News August 19, 2024
నెల్లూరు: ఒక గేటు పెట్టలేని ప్రభుత్వం 5 ఏళ్లు పాలించింది: సీఎం

సోమశిల ప్రాజెక్టు సందర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు పోతే దానిని పెట్టకుండా 5 ఏళ్లు పాలించిందని విమర్శించారు. సోమశిల మరమ్మతులకు రూ. 95 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడున్న NDA ప్రభుత్వం ఎన్నికష్టాలు ఉన్నా అన్ని పనులు పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న హౌస్ అరెస్ట్

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. సోమశిల జలాశయం సందర్శనకు వెళుతున్న సందర్భంగా ఆయనకు నోటీసులు అందించినట్లు సమాచారం. ఈ నోటీసులు అందజేయడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
News January 10, 2026
సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగోపై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్
News January 10, 2026
నెల్లూరు: భారీ పరిశ్రమ.. వెయ్యి ఉద్యోగాలు

నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్లో భారీ పరిశ్రమ రానుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,675 కోట్లతో 200 ఎకరాల్లో ఇంగోట్, వేఫర్ల తయారీ యూనిట్ పెట్టనుంది. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 200 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ సైతం నెలకొల్పనున్నారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు 12.6మిలియన్ లీటర్ల నీటిని కేటాయిస్తారు. 6నెలల్లోనే భూముల కేటాయిపు పూర్తి చేస్తారు.


