News August 19, 2024
15,280 ఉద్యోగాలు రాబోతున్నాయి: సీఎం చంద్రబాబు

AP: శ్రీసిటీలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి మార్గం సుగమం చేసినట్లు CM చంద్రబాబు చెప్పారు. ‘ఇవాళ ₹1,570 కోట్ల పెట్టుబడితో 15 ప్రాజెక్టులను ప్రారంభించా. ₹900 కోట్ల విలువైన 7 కంపెనీలకు శంకుస్థాపన చేశా. ₹1,213 కోట్ల పెట్టుబడి కోసం 5 సంస్థలు MOUలపై సంతకాలు చేశాయి. 15,280 ఉద్యోగాలు రాబోతున్నాయి. స్వర్ణాంధ్ర-2047 కోసం పెట్టుబడుల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మార్చడానికి కట్టుబడి ఉన్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 3, 2026
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న జగన్

AP: మాజీ CM, YCP అధ్యక్షుడు జగన్ రేపు గుంటూరులో పర్యటించనున్నారు. CM చంద్రబాబుపై అనుచిత వాఖ్యల కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అలాగే శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ సహా ఆయన కుటుంబాన్ని జగన్ కలవనున్నారు. TDP శ్రేణుల దాడిలో దెబ్బతిన్న రమేశ్ ఇంటిని పరిశీలిస్తారు. ఈ మేరకు YCP MLC తలశిల రఘురామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
News February 3, 2026
వ్యవసాయంలో అధిక ఆదాయం ఇలా సాధ్యం

సాగులో సమీకృత వ్యవసాయంతో అధిక ఆదాయం సాధ్యమంటున్నారు నిపుణులు. భూమిని భాగాలుగా విభజించి వరి, చిరు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూనే.. కోళ్లు, గొర్రెలు, మేకలు, పాడి పశువులు, చేపల పెంపకాన్ని చేపట్టడాన్నే సమీకృత వ్యవసాయం అంటారు. దీని వల్ల కొద్దిపాటి భూమిలోనే ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. దీన్ని ఎలా చేయాలి? ఏ భూములకు అనుకూలమో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News February 3, 2026
నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

TG: మున్సి పల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాపై సాయంత్రం క్లారిటీ రానుంది. రెబల్స్ను బుజ్జగించే పనిలో 3 పార్టీల (కాంగ్రెస్, BRS, BJP) అగ్రనేతలు నిమగ్నమయ్యారని సమాచారం. పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు.


