News August 19, 2024
రాఖీ: అక్కకు ❤️ ప్రాణదానం చేసిన సోదరుడు

ప్రాణాపాయంలో ఉన్న సోదరికి కిడ్నీని దానం చేసి ఈ రాఖీ పండుగను స్పెషల్గా మార్చాడు ఓ వ్యక్తి. గోవాలో ఓ మహిళ(43) పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడేది. కచ్చితంగా కిడ్నీ మార్చాలని వైద్యులు చెప్పారు. సోదరుడూ కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ తొలుత తాను చికిత్స తీసుకుని, మరో కిడ్నీని అక్కకు దానం చేశారు. సదరు మహిళ ఇవాళ సోదరుడికి రాఖీ కడుతూ భావోద్వేగానికి గురయ్యారని ఆమె భర్త వెల్లడించారు.
Similar News
News July 8, 2025
అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

అహ్మదాబాద్లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News July 8, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.
News July 8, 2025
‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్బాబు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.