News August 20, 2024
డెంగ్యూతో భార్య మృతి.. కేంద్ర మంత్రికి ఎయిమ్స్లో చికిత్స

కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయెల్ ఓరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆయనను భువనేశ్వర్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రెండు రోజుల కిందట జుయెల్ భార్య జింగియా డెంగ్యూతోనే కన్నుమూశారు. కాగా ఒడిశాలోని సుందర్గఢ్ నుంచి బీజేపీ తరఫున ఆయన ఆరుసార్లు ఎంపీగా గెలిచారు.
Similar News
News November 12, 2025
తగ్గిన బంగారం ధర.. పెరిగిన సిల్వర్ రేట్

గత రెండు రోజులు పెరిగిన గోల్డ్ రేట్స్ ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.330 తగ్గి రూ.1,25,510కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.300 దిగివచ్చి రూ.1,15,050గా నమోదైంది. అటు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.3వేలు పెరిగి రూ.1,73,000కు చేరింది.
News November 12, 2025
హీరోగా మారిన డైరెక్టర్.. రూ.30 కోట్ల రెమ్యునరేషన్?

<<18171965>>హీరో అవతారమెత్తిన<<>> కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సరికొత్త ఘనత సాధించినట్లు టాక్. దర్శకుడిగా ₹50Cr రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన.. కథానాయకుడిగా తొలి మూవీకే ₹30Cr వరకు అందుకుంటున్నట్లు సమాచారం. ఇదొక రికార్డని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేశ్ ప్రధాన పాత్రలో ‘DC’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. కాగా ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ చిత్రాలతో ఆయన స్టార్ డైరెక్టర్గా ఎదిగిన విషయం తెలిసిందే.
News November 12, 2025
భీష్ముడిని, ధర్మరాజు ఏం అడిగాడంటే?

కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
భావం: అన్ని ధర్మాలలో ఉత్తమ ధర్మం ఏది? దేనిని జపిస్తే జీవులు జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతారు? అని ధర్మరాజు, భీష్ముడిని అడిగారు. మోక్ష సాధన మార్గాన్ని, సర్వ శ్రేయస్సుకు దారితీసే ఏకైక మార్గాన్ని తెలుసుకోవాలనే ధర్మరాజు జ్ఞాన జిజ్ఞాస ఈ ప్రశ్నలలో వ్యక్తమవుతోంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


