News August 20, 2024

శత్రువుల్ని గుర్తించి కాల్చే ఏఐ రోబో!

image

2 కి.మీ దూరంలో ఉన్న శత్రువుల్ని కాల్చగల ఏఐ రోబోను యూపీలోని ITM కాలేజీకి చెందిన విద్యార్థులు రూపొందించారు. ఉక్కు, ఫైబర్, ఇతర లోహాలతో దీన్ని రూపొందించామని, రూ. 1.8 లక్షలు ఖర్చయిందని వారు వివరించారు. శత్రువుల్ని గుర్తించిన అనంతరం భుజంపై ఉండే 18ఎంఎం ఎలక్ట్రానిక్ మెషీన్ గన్ ద్వారా రోబో వారిపై కాల్పులు జరుపుతుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ఉపయోగపడేలా దీని నమూనాను రక్షణ శాఖకు పంపిస్తామని పేర్కొన్నారు.

Similar News

News September 17, 2025

ECILలో 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు

image

TG: HYDలోని ప్రభుత్వరంగ సంస్థ ECIL 160 కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నికల్ ఆఫీసర్-C ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. BE/B.Tech విభాగాల్లో 60% మార్కులు, ఏడాది అనుభవం, 30 ఏళ్లలోపు వాళ్లు అర్హులు. జీతం తొలి ఏడాదిలో నెలకు రూ.25 వేలు, రెండో ఏడాది రూ.28 వేలు, 3, నాలుగో ఏడాది రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం https://ecil.co.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

News September 17, 2025

రోజూ గంట నడిస్తే.. ఇన్ని లాభాలా?

image

నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజులో గంటసేపు నడిస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి వివరించారు. *రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. *ఒత్తిడి తగ్గుతుంది. *మానసిక స్థితి మెరుగవుతుంది.
*రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలోకి వస్తాయి. *పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. *మనసు ప్రశాంతంగా ఉంటుంది. *డోపమైన్ (హ్యాపీ హార్మోన్) పెరుగుతుంది. అందుకే నడవడం మొదలుపెట్టండి. SHARE IT

News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.