News August 20, 2024

మ‌న్మోహ‌న్ సింగ్‌ది కూడా లేట‌ర‌ల్ ఎంట్రీనే: కేంద్ర మంత్రి

image

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ 1976లో ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా లేట‌రల్ ఎంట్రీ ద్వారా నియ‌మితుల‌య్యార‌ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గుర్తు చేశారు. RSSకి చెందిన వారిని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో నియ‌మిస్తున్నార‌న్న‌ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. నిబంధనలు రూపొందించే బాధ్యతను UPSCకి ఇచ్చి లేటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రధాని మోదీ క్రమబద్ధీకరించారని మంత్రి పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

పరారీలో MLA: వేట మొదలుపెట్టిన పోలీసులు

image

ఢిల్లీలోని ఓక్లా MLA అమనతుల్లా ఖాన్ (ఆప్) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన నిన్నటి నుంచి పరారీలో ఉన్నారు. దీంతో టీములుగా విడిపోయిన అధికారులు ఢిల్లీ, రాజస్థాన్, యూపీలో సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేశారు. త్వరలోనే ఆయన్ను పట్టుకుంటామని అంటున్నారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన షాబాజ్ ఖాన్‌ తప్పించుకొనేందుకు మద్దతుదారులతో కలిసి ఆయన సాయం చేశారని నిన్న FIR నమోదైంది. అప్పటి నుంచి ఆయన కనిపించడం లేదు.

News February 12, 2025

తగ్గిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఈరోజు తగ్గి కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 తగ్గడంతో రూ.86,670కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,07,000గా ఉంది.

News February 12, 2025

బర్డ్ ఫ్లూ అంటే?

image

బర్డ్ ఫ్లూ(ఏవియన్ ఫ్లూ) పక్షుల్లో H5N1 వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది 1996లో చైనాలో ఉద్భవించింది. వైరస్ సోకిన పక్షుల శ్వాసకోశ స్రావాలు, రక్తంతో వ్యాప్తి చెందుతుంది. 1997-2024 వరకు 954 మందికి సోకగా, 464మంది మరణించారు. ఈ వ్యాధి మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి స్పష్టమైన ఆధారాల్లేవు. వైరస్ సోకిన పక్షులతో సన్నిహితంగా, ముఖ్యంగా కోళ్ల ఫారాల్లో పనిచేసే కార్మికులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉంది.

error: Content is protected !!