News August 21, 2024

పొగాకు పంటకు పెనాల్టీ రద్దు: ఎంపీ మహేశ్

image

పొగాకు రైతులు కొందరు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఢిల్లీలో కేంద్ర కామర్స్ మంత్రిని ఎంపీ మహేశ్ ఇటీవల కలిసి రైతులు అదనంగా పండించిన పొగాకు పంటపై పెనాల్టీ రద్దు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అదనంగా పండించిన పొగాకు పంటకు పెనాల్టీ రద్దు చేస్తూ మంగళవారం జీవో విడుదల చేసిందని ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News January 20, 2026

పగో కలెక్టర్‌ నాగరాణికి ‘ఉత్తమ’ పురస్కారం

image

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 2025 సంవత్సరానికి ‘ఉత్తమ ఎన్నికల విధానాల’ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలకు వివిధ విభాగాల్లో పురస్కారాలు దక్కగా.. పగో కలెక్టర్‌కు ఈ గౌరవం లభించింది. జనవరి 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.

News January 20, 2026

ప.గో: ఇంటర్ పరీక్షలపై డీఆర్వో సూచనలు

image

ఈ నెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో బి.శివన్నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని, ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News January 20, 2026

ఉండిలో జంట మృతదేహాల కలకలం

image

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.