News August 21, 2024

ఇవాళ భారత్ బంద్.. పిల్లలను స్కూలుకు పంపుతున్నారా?

image

ఎస్సీ వర్గీకరణకు నిరసనగా బీఎస్పీ సహా పలు సంఘాలు నేడు భారత్ బంద్‌కు పిలుపునివ్వగా స్కూళ్లు, కాలేజీల విషయంలో అయోమయం నెలకొంది. APలోని ఆంధ్రా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ సెలవు ప్రకటించారు. మరోవైపు ఈ రోజు సెలవు అని స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు మెసేజులు రాలేదు. ఎవరైనా వచ్చి ఆందోళన చేస్తే హాలిడే ఇస్తామని పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరి మీ పిల్లలను ఇవాళ స్కూలుకు పంపుతున్నారా?

Similar News

News November 11, 2025

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో PO ఉద్యోగాలు

image

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. CMA/ICWA అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.southindianbank.bank.in

News November 11, 2025

అరటి ఆకులో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

image

శుభకార్యాల సమయంలో చాలా మంది అరటి ఆకులో భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇది సంప్రదాయమే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనకరమని వైద్యులు చెబుతున్నారు. అరటి ఆకులో ఉన్న పాలీఫినాల్స్ & యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, సహజ రుచిని ఆస్వాదించవచ్చని పేర్కొంటున్నారు.

News November 11, 2025

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.