News August 21, 2024

దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని క్లియర్ చేయడానికి దువ్వాడ మీదుగా హైదరాబాద్-కటక్-హైదరాబాద్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించిందని వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్-కటక్ ప్రత్యేక రైలు(07165), ఈనెల 28 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకు కటక్-హైదరాబాద్ రైలు(07166) నడుస్తుందన్నారు.

Similar News

News November 4, 2025

కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

image

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్‌‌ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.

News November 4, 2025

కంచరపాలెంలో 7న జాబ్ మేళా

image

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.

News November 4, 2025

విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.