News August 21, 2024
ప్రొద్దుటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశారంటూ ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మహబూబ్ బాషా మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ వలికి ఏపీఎస్పీడీసీఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన భానుప్రతాప్ రెడ్డి రెండేళ్ల క్రితం ఫోన్ పే ద్వారా పలుమార్లు రూ.2.47లక్షలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.
News January 12, 2026
కడప: ఒక MRO సస్పెండ్.. మరో 11 మందికి నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ముఖ్యంగా జిల్లా అతి తక్కువగా పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తొండూరు MRO రామచంద్రుడు సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CK దిన్నె MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 12, 2026
గండికోట ఉత్సవాల్లో పర్యాటక మంత్రి.. ఏం మాట్లాడారంటే.!

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం గండికోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. గండికోట ఓ వారసత్వ సంపదని మోదీ, CM, DyCm ఇలాంటి కట్టడాల పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఈ ప్రాంతంలో హోటల్స్ వెలుస్తాయన్నారు. ఈ ప్రాంత వసతి, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లు చేసిన కలెక్టర్, SP ఇతర జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.


