News August 21, 2024

HYD: 2 వేల మందితో భారీ ర్యాలీ

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు (దాదాపు 2 వేల మంది) ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ RBనగర్ నుంచి మధురానగర్, HYD- బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.

Similar News

News September 17, 2025

బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌కు వీడ్కోలు

image

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.

News September 17, 2025

నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

image

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్‌లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).