News August 21, 2024
రూ.330 కోట్లకు పెరిగిన నీరజ్ చోప్రా బ్రాండ్ విలువ

పారిస్ ఒలింపిక్స్ తర్వాత కొందరు అథ్లెట్ల బ్రాండ్ విలువ భారీగా పెరిగింది. సిల్వర్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా విలువ 30-40% వృద్ధిరేటుతో రూ.330 కోట్లకు చేరిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2 పతకాలు అందుకున్న మనూ భాకర్ విలువ 6 రెట్లు పెరిగింది. గతంలో ఒక్కో డీల్కు రూ.25 లక్షలు తీసుకొనే ఆమె తాజాగా థమ్స్అప్తో రూ.1.5 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. వినేశ్ ఫొగట్ రూ.75 లక్షల నుంచి కోటి వరకు తీసుకుంటున్నారు.
Similar News
News October 24, 2025
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News October 24, 2025
చైనా కుతంత్రం.. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్

భారత సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతోంది. టిబెట్లోని పాంగాంగ్ లేక్ వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు సాగుతున్నాయని India Today తెలిపింది. కమాండ్, కంట్రోల్ బిల్డింగ్స్, బారక్స్, వెహికల్స్ షెడ్స్ కడుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ క్షిపణులను మోసుకెళ్లే, ప్రయోగించే TEL వాహనాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. HQ-9 మిసైల్ వ్యవస్థలను దాచే అవకాశం ఉందంటున్నారు.
News October 24, 2025
వీరి మరణానికి బాధ్యులెవరు?

బస్సు <<18088805>>ప్రమాదాలకు<<>> ప్రధాన కారణం సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులను ‘మేనేజ్’ చేసి బస్సులు తిప్పుతాయనేది బహిరంగ రహస్యమే. తీరా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు ‘మళ్లీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం’ అని ఓ కామన్ డైలాగ్ చెప్పేస్తారు. మరి ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహించాలి? బస్సు యాజమాన్యమా? ప్రభుత్వమా? అధికారులా? అన్నీ తెలిసి బస్సెక్కే ప్రయాణికులా? COMMENT


