News August 21, 2024

మృతదేహాలను ఇంట్లోనే భద్రపరుస్తారు.. ఎందుకంటే?

image

ఎవరైనా మరణిస్తే ఆరోజో, మరుసటి రోజో అంత్యక్రియలు పూర్తి చేస్తుంటారు. కానీ, ఇండోనేషియాలోని టోరజా జాతి ప్రజలు దీనికి విరుద్ధం. టోరజాన్ల అంత్యక్రియలు, తదుపరి ఆచారాల కోసం రూ.లక్షలు ఖర్చవుతుంది. డబ్బు లేకపోతే, సమకూర్చేవరకూ మృతదేహాలను లేపనం పూసి ఏళ్లతరబడి ఇంట్లోనే ఉంచుతారు. 12 రోజులపాటు జరిగే ఈ అంత్యక్రియల్లో డజన్ల కొద్దీ గేదెలు, వందల కొద్దీ పందులను బలిస్తారు. అలా చేయకపోతే వారి ఆత్మ శాంతించదని నమ్మకం.

Similar News

News November 7, 2025

సినిమా అప్డేట్స్

image

* మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ అరుదైన ఘనత సాధించింది. లాస్‌ఏంజెలిస్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో వచ్చే ఏడాది FEB 12న ప్రదర్శితమవనుంది.
* పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించిన ‘విలాయత్ బుద్ధ’ మూవీ ఈ నెల 21న రిలీజవనుంది.
* దివంగత మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా హాలీవుడ్‌లో ‘మైఖేల్’ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ఆయన సోదరుడు జెర్మైన్ జాక్సన్ కుమారుడు జాఫర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

News November 7, 2025

పెరిగిన ఓటింగ్.. మార్పుకు సంకేతమా..?

image

బిహార్ తొలిదశ ఎన్నికల్లో 20 ఏళ్లలో తొలిసారి 64.66% ఓటింగ్ శాతం పెరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. భారీ ఓటింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతమని ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అధికారపక్షంపై అసహనం, ఆగ్రహం అధికంగా ఉంటే ఓటర్లూ అదేస్థాయిలో పోలింగ్ స్టేషన్లకు వస్తారన్నారు. 1998సం.లో (MP ఎన్నికలు) తొలిసారి 64%, 2000లో 62% ఓటింగ్ నమోదవగా అప్పుడు అధికార బదిలీ జరిగింది. ఈసారి ఇది రిపీటవుతుందా?

News November 7, 2025

బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

image

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.