News August 21, 2024

నిర్మల్: ఈ నెల 24న జాబ్ మేళా

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 24 ఉదయం 9 గంటలకు HCL టెక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO జాదవ్ పరుశురాం తెలిపారు. 2024 సంవత్సరంలో 75% మార్కులతో ఉత్తీర్ణులైన HEC, CEC విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Similar News

News November 1, 2025

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య అందించాలి

image

ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి ఆదేశించారు. శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజార్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు.

News November 1, 2025

ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

image

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్‌ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News October 31, 2025

ఆదిలాబాద్: విద్యతో పాటు సృజనాత్మకత అవసరం: కలెక్టర్

image

యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ‘బోస్ ఫెలోషిప్’ సామాజిక సంస్థ భారత్ దేకో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. సమాజంలో స్థిరమైన మార్పు రావాలంటే విద్యతో పాటు సమర్థవంతమైన నైపుణ్యాలు కూడా అవసరమన్నారు.