News August 21, 2024
రూ.2లక్షల పైనున్న వాళ్లకు అప్పుడే రుణమాఫీ: మంత్రి

TG: రాష్ట్రంలో 41,78,892 మంది రైతులు రుణాలు తీసుకున్నట్లు బ్యాంకులు నివేదిక ఇచ్చాయని మంత్రి తుమ్మల తెలిపారు. అధికారులు రుణమాఫీ కాని కుటుంబాల ఇళ్లకు వెళ్లి నిర్ధారించి జాబితా రూపొందిస్తారని వెల్లడించారు. అనంతరం వారికీ మాఫీ చేస్తామన్నారు. రూ.2లక్షలు కంటే ఎక్కువున్న వాళ్లు పైమొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ అవుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేకున్నా మాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
Similar News
News September 18, 2025
ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

EPFO <
News September 18, 2025
నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షహోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.
News September 18, 2025
విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.