News August 21, 2024

అచ్యుతాపురం: ముక్కలు ముక్కలైన శరీర అవయవాలు

image

అచ్యుతాపురం ఫార్మా ఘటనలో మనసును కలిచి వేసే దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. రియాక్టర్ పేలుడు ధాటికి కొందరు కార్మికుల శరీర అవయవాలు ముక్కలుముక్కలయ్యాయి. కనీసం మృతదేహాలను గుర్తించే స్థాయిలో కూడా లేకపోవడం ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. ఫార్మాసిటీ సమీపంలోని ముళ్ల పొదల్లో మాంసం ముద్దలు పడి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.  

Similar News

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

News September 22, 2025

విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

image

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News September 22, 2025

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో తగ్గనున్న ధరలు

image

సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో నేటి నుంచి నూతన జి.ఎస్.టి అమలు చేయనున్నట్లు సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తెలిపారు. రూ.1000 నుంచి రూ.2500 విలువ గల వస్త్రాలపై 12%గా ఉన్న జి.ఎస్.టి 5%గా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నూతన జి.ఎస్.టి విధానం అమలుతో 6.25% వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు.. వినియోగదారులు గమనించాలన్నారు.