News August 21, 2024

చాందీపురా వైరస్.. 28మంది చిన్నారులు మృతి

image

చాందీపురా <<13646193>>వైరస్<<>> బారిన పడి గుజరాత్‌లో ఇప్పటివరకు 28 మంది చిన్నారులు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిశికేశ్ పటేల్ తెలిపారు. జులైలో తొలి కేసు నమోదవ్వగా మరణించిన వారంతా 14 ఏళ్ల లోపేనని చెప్పారు. మెదడువాపు సంబంధిత వైరస్‌తో ఇప్పటివరకు 101 మంది 14 ఏళ్ల లోపు చిన్నారులు చనిపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని వారం రోజులుగా ఎలాంటి కేసులు నమోదవ్వలేదన్నారు.

Similar News

News July 11, 2025

ముగిసిన తొలి రోజు ఆట.. ENG స్కోర్ ఎంతంటే?

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ నిలదొక్కుకుంది. మూడో సెషన్ ఆరంభంలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయినా రూట్ 99*, స్టోక్స్ 39* రన్స్‌తో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 251 రన్స్ చేసింది. భారత బౌలర్లలో నితీశ్ 2, బుమ్రా, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

News July 11, 2025

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలివే!

image

AP: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. ప్రతిరోజూ ఉ.8-10 గంటల వరకు, రా.7-9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు.
ముఖ్యమైన తేదీలు..
* 16-09-2025 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, * 23-09-2025 బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, * 24-09-2025 ధ్వజారోహణం, * 28-09-2025 గరుడ వాహనం, * 01-10-2025 రథోత్సవం,
* 02-10-2025 చక్రస్నానం

News July 11, 2025

కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ విడుదల

image

AP: పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదలైంది. 6,100 పోస్టులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జూన్‌ 1న తుది పరీక్ష నిర్వహించింది. 37,600 మంది పరీక్ష రాయగా, 33,921 మంది క్వాలిఫై అయ్యారు. 12వ తేదీలోపు రూ.1000 చెల్లించి OMR వెరిఫికేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి స్కోర్ తెలుసుకోండి. కటాఫ్, ఫైనల్ రిజల్ట్స్‌ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.