News August 22, 2024
పర్యాటకశాఖ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి సమీక్ష

మహబూబ్ నగర్ జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..నిర్దేశించిన సమయంలోగా చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని, మినీ ట్యాంక్ బండ్ ను దగ్గరలోఉన్న కాల్వ ద్వారా కృష్ణ నీటితో నింపాలని సూచించారు.
Similar News
News April 1, 2026
మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆనందరావు

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు తన సహచర న్యాయవాదులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. న్యాయవాదుల ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.
News April 1, 2026
హనుమాన్ జయంతి వేడుకల్లో మేయర్ మమత

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News April 1, 2026
హనుమాన్ జయంతి వేడుకల్లో మేయర్ మమత

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


