News August 22, 2024
యాజమాన్యం నా కాల్స్కూ స్పందించట్లేదు: హోంమంత్రి

AP: అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం విషయంలో పరిశ్రమ యాజమాన్యం తప్పిదం ఉందని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ‘17మంది కన్నుమూయడం బాధాకరం. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. నేను కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి. తరచూ ప్రమాదం జరిగే సెజ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్ని నిర్మించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
Similar News
News July 11, 2025
శుభ సమయం (11-07-2025) శుక్రవారం

✒ తిథి: బహుళ పాడ్యమి రా.2.02 వరకు తదుపరి పాడ్యమి
✒ నక్షత్రం: పూర్వాషాడ ఉ.6.29 వరకు తదుపరి ఉత్తరాషాడ
✒ శుభ సమయం: ఉ.10.25-ఉ.10.55 వరకు తిరిగి సా.5.25-సా.5.37 వరకు
✒ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 వరకు
✒ యమగండం: మ.3.00-సా.4.30 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12.48 వరకు పునః మ.12.24-మ.1.12 వరకు ✒ వర్జ్యం: మ.2.46-సా.4.25 వరకు
✒ అమృత ఘడియలు: రా.12.33-రా.2.13 వరకు
News July 11, 2025
నేటి ముఖ్యాంశాలు

* విద్యార్థులు బాగా చదువుకుని రాజకీయాల్లోకి రావాలి: CM CBN
* రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్
* బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక ఎన్నికలు: TG ప్రభుత్వం
* ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ బడులు: మంత్రి లోకేశ్
* 17వేలకు పైగా ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ సిద్ధం: మంత్రి పొన్నం
* HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి 14 రోజుల రిమాండ్
* AP: కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డు విడుదల
News July 11, 2025
పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దాం: చంద్రబాబు

AP: పీ4(పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్ట్నర్షిప్) అమలుకు ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మార్గదర్శకులుగా ఉండేందుకు పారిశ్రామికవేత్తలు, NIRలు వంటివారు 18,332మంది ముందుకొచ్చారు. వారిలో టాప్ 200మందిని ఈనెల 18న డిన్నర్లో సీఎం కలవనున్నారు. పీ4 లక్ష్యాలను వివరించి మరింత మందిని భాగస్వాములను చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని CM తెలిపారు. పేదల కోసం పెద్దలను ఆకర్షిద్దామని పేర్కొన్నారు.