News August 22, 2024
గుంటూరులో బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారం జరిగినట్లు అరండల్ పేట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బొంగరాలబీడుకు చెందిన 16 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మాయమాటలు చెప్పి ఆ బాలికకు దగ్గరై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక తండ్రికి తెలియజేసింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 7, 2025
గుంటూరు జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు

రహదారి ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కాజా టోల్గేట్, తాడికొండ అడ్డరోడ్డు, పేరేచర్ల, నారాకోడూరు, నందివెలుగు రోడ్డు, వాసవి క్లాత్ మార్కెట్, చుట్టుగుంట ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. 78 వాహనాలపై కేసులు నమోదు చేయడంతో పాటూ రూ. 7,79,720 జరిమానా విధించామని SP వకుల్ జిందాల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని అంబులెన్స్ సీజ్ చేశామన్నారు.
News November 7, 2025
GNT: రెండవ శనివారం సెలవుపై సడలింపు..రేపు స్కూల్స్కి హాలిడే

తుఫానుకు 4 రోజులు ఇచ్చిన సెలవులను భర్తీ చేస్తూ 2వ శనివారం కూడా స్కూల్స్ పనిచేస్తాయని చేసిన ప్రకటనను సడలించారు. గత నెల 23న అన్ని పాఠశాలలు తమ స్థానిక సెలవులలో ఒకదాన్ని వినియోగించుకోవడం వల్ల 8వ తేదీ 2వ శనివారం పని చేయవలసిన అవసరం లేదని తమకు సమాచారం వచ్చినట్లు తెనాలి ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మిగిలిన 3 సెలవులను ప్రొసీడింగ్స్లో జారీ చేసిన విధంగా వచ్చే 3 నెలల్లో 2వ శనివారాలతో భర్తీ చేసుకోవచ్చన్నారు.
News November 7, 2025
దుగ్గిరాలలో యువకుడి దారుణ హత్య

దుగ్గిరాలలోని వంతెన డౌన్లో రజకపాలెంకు చెందిన వీరయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


