News August 22, 2024
18 మంది మృతి.. ప్రమాదం జరిగిందిలా

AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.
Similar News
News January 26, 2026
ప్చ్ శాంసన్.. 9 ఇన్నింగ్స్లలో 104 పరుగులు

టీ20Iల్లో ఓపెనర్గా సంజూ శాంసన్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. 2025 జూన్ నుంచి 9 ఇన్నింగ్స్లలో 104 పరుగులు (Avg 11.55, SR 133.33) మాత్రమే చేశారు. వీటిలో ఒక్కసారి మాత్రమే పవర్ ప్లేలో నాటౌట్గా నిలిచారు. ఈ 9 ఇన్నింగ్స్ల స్కోర్లు 26(20), 5(7), 3(6), 1(3), 16(7), 37(22), 10(7), 6(5), 0(1)గా ఉన్నాయి. తాజాగా NZ సిరీస్లో ఫెయిల్ అవుతుండటంతో తుది జట్టులో ఆయనకు స్థానం దక్కే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
News January 26, 2026
కొత్త సినిమా ప్రకటించిన హీరో నితిన్

డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. ‘NO BODY NO RULES’ అంటూ పోస్టర్ను రిలీజ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. కాగా VI ఆనంద్ గతంలో ‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన’ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ అయినా నితిన్కి హిట్ ఇస్తుందేమో చూడాలి.
News January 26, 2026
జనవరి 26: చరిత్రలో ఈరోజు

1950: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ
1957: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర అవతరణ
1957: భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ జననం
1968: సినీనటుడు రవితేజ జననం
1986: హీరో నవదీప్ జననం
2001: గుజరాత్లో భూకంపం.. 20 వేల మందికిపైగా దుర్మరణం
2010: సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణం
*భారత గణతంత్ర దినోత్సవం


