News August 22, 2024

కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల: మంత్రి పొన్నం

image

బీసీ, ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకానికి TG ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటిదశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 21, 2026

MDK: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

నర్సాపూర్ PS పరిధిలో ఇవ్వాల్సిన డబ్బులను అడిగిన వ్యక్తిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుభావళి తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆటో డ్రైవర్ వడ్ల నిరంజన్ కల్లు తాగేందుకు కల్లు దుకాణం వద్దకు వెళ్లగా, అక్కడ కనిపించిన శివప్రసాద్‌ను ఇవ్వాల్సిన డబ్బులు అడగగా గొడవ జరిగింది. దీంతో కల్లు సీసా పగలగొట్టి పొడిచాడు.

News January 21, 2026

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి వివేక్

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 157 సంఘాలకు రూ.66,93,541 వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.3,09,46,721 వడ్డీని అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతుందన్నారు.

News January 21, 2026

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యం: మంత్రి వివేక్

image

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 157 సంఘాలకు రూ.66,93,541 వడ్డీలేని రుణాల చెక్కును అందజేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.3,09,46,721 వడ్డీని అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మహిళా పెట్రోల్ బంక్ కోసం స్థల సేకరణ జరుగుతుందన్నారు.