News August 22, 2024

నెల్లూరు: ‘ఇసుక తోలకంలో వే బిల్ లేకుంటే చర్యలు’

image

ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్, జిల్లా SP సంయుక్తంగా ప్రెస్ మీట్ ద్వారా గురువారం ప్రజలకు సూచనలు చేశారు. ఇసుక కావలసిన వారు టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ నందు పేర్లు నమోదు చేసుకున్న రవాణా వాహనాల ద్వారా ఇసుకను అందిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నప్పటికీ 24 గంటలలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వే బిల్ లేకుంటే చర్యలు తీసుకుంటామని SP తెలిపారు.

Similar News

News March 24, 2026

నెల్లూరు జిల్లాలో సదరం స్లాట్ ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలో కొన్ని ఏళ్లుగా దివ్యాంగులు సదరం స్లాట్ల బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ జిల్లాలోని అన్ని సచివాలయాల్లో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సమాచారం అందుకున్న దివ్యాంగులు ఆయా సచివాలయాలకు సమగ్ర వివరాలతో వెళ్లి నమోదు చేయించుకుంటున్నారు. ఆధార్, రేషన్ కార్డు, ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్ వెంట తీసుకుని వెళ్లాలి.

News March 24, 2026

నెల్లూరు: రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఒకరు చనిపోయారు. చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న రైలు నుంచి జారిపడి సోమవారం రాత్రి ఒకరు మృతిచెందారు. అతని వయస్సు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండవచ్చు. 5.4 అడుగుల ఎత్తు చామన ఛాయ రంగు కలిగి ఉన్నాడు. గ్రీన్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, బ్యాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. రైల్వే ఎస్ఐ హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 24, 2026

కావలి: సార్.. నేనే బతికే ఉన్నా..!

image

నెల్లూరు జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. కావలి మండలం అన్నగారిపాలేనికి చెందిన బొబ్బల రమణమ్మ ఆధార్ కార్డు తీసుకుని రేషన్ షాపు వద్దకు వెళ్లారు. బియ్యం ఇవ్వాలని అడిగితే ‘నువ్వు చనిపోయావని చూపిస్తోంది. నీకు బియ్యం ఇవ్వడం కుదరదు’ అని డీలర్ చెప్పారు. తానే బతికే ఉన్నానని.. ప్రతినెలా పెన్షన్ కూడా ఇస్తున్నారని ఆమె చెప్పారు.