News August 22, 2024

నెల్లూరు: ‘ఇసుక తోలకంలో వే బిల్ లేకుంటే చర్యలు’

image

ఇసుక రవాణా మీద జిల్లా కలెక్టర్, జిల్లా SP సంయుక్తంగా ప్రెస్ మీట్ ద్వారా గురువారం ప్రజలకు సూచనలు చేశారు. ఇసుక కావలసిన వారు టోల్ ఫ్రీ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ నందు పేర్లు నమోదు చేసుకున్న రవాణా వాహనాల ద్వారా ఇసుకను అందిస్తామని తెలిపారు. ఏ సమస్య ఉన్నప్పటికీ 24 గంటలలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వే బిల్ లేకుంటే చర్యలు తీసుకుంటామని SP తెలిపారు.

Similar News

News January 26, 2026

బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రేపు జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ASP దీక్ష ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీలను ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ల సహకారంతో విస్తృతంగా నిర్వహించారు.

News January 25, 2026

గణతంత్ర వేడుకల షెడ్యూల్ వివరాలు విడుదల

image

సోమవారం నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే 77వ గణతంత్ర వేడుకలకు సంబంధించి కార్యక్రమం వివరాలు I&PR కార్యాలయం విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల జెండా ఆవిష్కరణ చేయనున్నారు. కలెక్టర్ సందేశం, శకటాల ప్రదర్శన, విద్యార్థిని, విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేత జాతీయ గీతాలాపనతో ముగుస్తుందన్నారు.

News January 25, 2026

నెల్లూరు జిల్లావ్యాప్తంగా పోలీస్ హై అలర్ట్: ఎస్పీ

image

గణతంత్ర దినోత్సవం, రథసప్తమి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ దేవాలయాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా నిరంతరం నిఘా ఉంచామన్నారు.