News August 22, 2024

ఇసుక పంపిణీ విధానం పక్కాగా అమలు చేయండి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇసుక పంపిణీ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై తహశీల్దార్స్, ఎంపీడీవోలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి సమస్యలు లేకుండా పంపిణీ జరగాలన్నారు.

Similar News

News March 12, 2026

కడప: 10th పరీక్షలు.. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఇవే.!

image

కడప: ఈనెల 16నుంచి 10th పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,152 మంది విద్యార్థులు 10th పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్ 27,731, ప్రైవేట్ 421మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు 14,486, బాలికలు 13,666 మంది ఉన్నారు. వీరి కోసం 167 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కందిమల్లాయపల్లె, కమలాపురం, వేంపల్లె, మైదుకూరు, వల్లూరు, ఎగువపేట పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

News March 12, 2026

రేపు కడపకు రానున్న గవర్నర్

image

రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈనెల 13న కడపకు రానున్నారు. YVU జరగనున్న స్నాతకోత్సవానికి ఆయన ఛాన్స్‌లర్ హోదాలో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి కార్యక్రమం జరిగే వేదిక చేరుకొంటారు. అనంతరం తిరిగి ఆయన విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News March 12, 2026

గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కడప ఎస్పీ

image

వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ నకిలీ ప్రకటనలు ఇచ్చి వాట్సాప్, ఎస్ఎంఎస్‌ల ద్వారా ఫేక్ లింకులు పంపించి మోసం చేస్తున్నారని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అధికారిక గ్యాస్ ఏజెన్సీల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని సూచించారు.