News August 23, 2024

నేటి గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నేటి నుంచి ప్రారంభించనున్న గ్రామ సభలను, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తమిమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గ్రామసభల సంసిద్ధతపై కలెక్టర్‌ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నేటి గ్రామ సభలలో మండలాధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

image

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2026

ప్రకాశం: 7th క్లాస్ బాలికతో 9th క్లాస్ బాలుడికి పెళ్లి

image

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు ఒంగోలులోని ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.

News March 15, 2026

మార్కాపురం- శ్రీశైలం మధ్య ప్రత్యేక బస్సులు

image

ఉగాది పండగను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లే భక్తులకోసం మార్కాపురం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM లావణ్య తెలిపారు. మార్చి 19వ తేదీ ఉగాది సందర్భంగా ప్రత్యేకంగా సుమారు 25 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉందన్నారు.