News August 23, 2024

త్రిపుర గవర్నర్‌ను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హైదరాబాద్ నగరంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పలు అంశాల గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట ఆర్మూర్ ప్రాంతానికి చెందిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.

Similar News

News September 18, 2025

NZB: పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి: CP

image

పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలని నిజామాబాద్ CP సాయి చైతన్య ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, జూదం, పీడీఎస్ రైస్ అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహణ పెంచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News September 18, 2025

NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

NZB: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలో వృద్ధురాలి శవం

image

ఎస్సారెస్పీ కాలువలో కొట్టుకువచ్చిన ఓ వృద్ధురాలి శవాన్ని జగిత్యాల(D) మల్యాల(M) నూకపల్లి బ్రిడ్జి వద్ద స్థానికులు గుర్తించారు. శవం ముందుకు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టి ఉంచారు. ఆమె నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ గ్రామానికి చెందిన ప్రభావతిగా గుర్తించారు. ఆమెకు మతిస్థిమితం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.