News August 23, 2024
అచ్యుతాపురం ఘటనలో తూ.గో వాసి మృతి.. రూ.కోటి చెక్కు అందజేత

అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామానికి చెందిన కొప్పర్తి గణేశ్ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద పార్మా ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. సీఎం చంద్రబాబు రూ.కోటి పరిహారం ప్రకటించడంతో నిన్న అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి చెక్కు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News January 19, 2026
తూ.గో: ‘పంచాయతీ, రెవెన్యూ శాఖలకే అధిక వినతులు’

కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు మొత్తం 147 అర్జీలు వచ్చాయి. కలెక్టర్, జేసీ వై.మేఘా స్వరూప్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన అర్జీలలో రెవెన్యూ విభాగానికి(రెవెన్యూ క్లినిక్) 62, పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధికి 59, హోంశాఖకు 9, వైద్యారోగ్య శాఖకు 17 దరఖాస్తులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు.
News January 19, 2026
తూ.గో: నేడు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్

జనవరి 19న కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
News January 19, 2026
తూ.గో: నేడు కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్

జనవరి 19న కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


