News August 23, 2024
ఏపీలో పెట్టుబడులకు ఆరియా గ్లోబల్ ఆసక్తి

APలో బయో సింథటిక్ వుడ్, హైడ్రో ఫాయిల్ బోట్ల తయారీ యూనిట్ల ఏర్పాటుకు స్పెయిన్కు చెందిన ఆరియా గ్లోబల్ సంస్థ ఆసక్తిగా ఉంది. రూ.300 కోట్ల పెట్టుబడితో లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే బోట్లను ఇండియన్ నేవీకి సరఫరా చేస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీలో వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో బయో సింథటిక్ వుడ్ను తయారు చేస్తామని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ Y పోస్టులు

<
News January 13, 2026
భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.
News January 13, 2026
‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్తో పాటు ఒక టబ్లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.


