News August 23, 2024
రాష్ట్రంలో మరో ప్రమాదం

AP: అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ <<13912550>>ప్రమాదం<<>> మర్చిపోకముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News March 6, 2026
దీదీకి కొత్త తలనొప్పి?

ఎన్నికల వేళ బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ <<19306866>>రవి<<>> రావడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 2021లో తమిళనాడుకు గవర్నర్గా వచ్చిన రవి డీఎంకే ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. రాష్ట్ర పాలసీను విభేదించడం, బిల్లులు ఆమోదించకపోవడం వంటివి చేసి వివాదాలకు కేరాఫ్గా నిలిచారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్గా రవి వైఖరి ఎలా ఉంటుందోనని తృణమూల్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
News March 6, 2026
ఆయిల్ ధరల ప్రభావం జీడీపీపై ఉంటుందా?

క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం భారత జీడీపీపై ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధర 10 డాలర్లు పెరిగిన ప్రతీసారి 0.5% జీడీపీ దెబ్బతింటుందంటున్నారు. ఇప్పటికే ముడి చమురు ధర 10 డాలర్ల వరకు పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ జీడీపీపైన ఉంటుందన్నారు. వారం రోజుల్లోనే $69గా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర $78కు పెరిగిందని.. మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగితే అది చమురు ధర $87కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
News March 6, 2026
ట్రంప్పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.


