News August 23, 2024
రాష్ట్రంలో మరో ప్రమాదం

AP: అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ <<13912550>>ప్రమాదం<<>> మర్చిపోకముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రెడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 12.30 గంటలకు రసాయనాలు కలుపుతుండగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News March 10, 2026
వంటగ్యాస్ పొదుపుగా వాడుకుంటే బెటర్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఈ ఛాలెంజెస్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో వంటగ్యాస్ను పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.
News March 10, 2026
Viral: పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష!

TG: ఆహ్వానం లేకుండా ఫంక్షన్కు వస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్కు చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకున్నా వస్తుండటంతో చాలా మంది తమ హాల్లో ఫంక్షన్లు చేయట్లేదని, దీంతో గిరాకీ తగ్గిందని ఆయన చెప్పారు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ‘ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తాం’ అని బోర్డు పెట్టారు.


