News August 23, 2024
జూరాల: 165.375 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుదుత్పత్తి

ప్రస్తుత వర్షాకాలం జూరాల ఎగువ, దిగువ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి 165.375 మిలియన్ యూనిట్లకు చేరింది. ప్రాజెక్టు నుంచి వరదనీటి విడుదల కొనసాగుతున్న నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఎగువన ఐదు యూనిట్ల ద్వారా 4.305, దిగువన ఆరు యూనిట్ల ద్వారా 4.583 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గురువారం నాటికి ఎగువన 94.563, దిగువన 70.812 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని చేపట్టామని అధికారులు తెలిపారు.
Similar News
News March 5, 2026
పాలమూరు: GOVT పథకాలపై వర్క్ షాప్

మహబూబ్ నగర్ లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమ శాఖ అధికారి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన అవసరమన్నారు. SBI,RSETI సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, యువజన అధికారి కోటా నాయక్, శిక్షణ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
News March 4, 2026
మన్యంకొండలో వైభవంగా అమ్మవారి ‘అశ్వవాహన’ సేవ!

మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు అమ్మవారి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుద్దీప కాంతులు, మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య ఈ సేవ వైభవంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
News March 4, 2026
మహబూబ్నగర్: రేపు ఈ కాలనీల్లో నీటి సరఫరా బంద్!

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర కాలనీ, మర్లు, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. సాంకేతిక కారణాల దృష్ట్యా సరఫరా నిలిపివేస్తున్నట్లు లైన్మెన్ మాధవరెడ్డి తెలిపారు. కాలనీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. తిరిగి శుక్రవారం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.


