News August 23, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన గ్రామసభలు

image

మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా బంటుమిల్లిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు.

Similar News

News March 12, 2026

కృష్ణా జిల్లాకు 74.8 కోట్లు మంజూరు

image

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం కృష్ణా జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. 1.33 లక్షల మంది రైతులకు రూ.74.8 కోట్లు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

News March 12, 2026

కృష్ణమ్మ చెంత.. ఇసుకాసురుల పంజా!

image

విజయవాడ-అవనిగడ్డ కరకట్ట వెంబడి <<19359993>>ఇసుక దోపిడీ<<>> జోరుగా సాగుతోంది. ఒక మీటరు తవ్వాలన్న నిబంధనను తుంగలో తొక్కి లోతుగా తవ్వేస్తుండగా, 20 టన్నుల సామర్థ్యం గల లారీల్లో 35 టన్నుల లోడుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. మైనింగ్ మంత్రి నియోజకవర్గంలోనే అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండలతోనే ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News March 12, 2026

కృష్ణా: ఎంత తవ్వినా చుక్క రావట్లేదు..!

image

దివిసీమలో <<19359974>>అక్రమ ఇసుక తవ్వకాలు<<>> భూగర్భ జలాలను కబళిస్తున్నాయి. పులిగడ్డ నుంచి VJA వరకు నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వేయడంతో, గతంలో 10 అడుగులకే దొరికే నీరు ఇప్పుడు 100 అడుగుల లోతులోనూ లభించడం లేదు. ఫలితంగా సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు అల్లాడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రకృతి వనరుల దోపిడీని అరికట్టాలని బాధితులుడిమాండ్ చేస్తున్నారు.