News August 23, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి YS జగన్ డెడ్‌లైన్

image

AP: అచ్యుతాపురం ఘటనకు సంబంధించి బాధితులకు ఇంకా పరిహారం అందలేదని YS జగన్ ఆరోపించారు. 2-3 వారాల్లోగా బాధితులకు పరిహారం అందించాలని ఆయన డెడ్‌లైన్ విధించారు. ‘నేను ఇచ్చిన గడువులోగా పరిహారం ఇవ్వకుంటే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాం. అవసరమైతే నేను కూడా ధర్నాలో పాల్గొంటా’ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, ప్రభుత్వం రూ.కోటి పరిహారం ప్రకటించింది.

Similar News

News March 24, 2026

యువతా.. దేశ రాజకీయం మార్చేందుకు సిద్ధమా?

image

రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువత, మహిళలకు గోల్డెన్ ఛాన్స్. నియోజకవర్గాల పునర్విభజనతో దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు <<19460921>>భారీగా<<>> పెరగనున్నాయి. దీంతో విస్తృత అవకాశాలు రానున్నాయి. దేశ దిశను మార్చాలనే సంకల్పం ఉన్నవారు ప్రజాక్షేత్రంలోకి దిగండి. కొత్త ఆలోచనలు, సరికొత్త భావజాలాలను ప్రజలకు పరిచయం చేసి వారి మెప్పు పొందండి. ‘నేపాల్‌’ను గెలిచిన Gen Z స్ఫూర్తితో ముందుకు కదలండి.

News March 24, 2026

విజయవాడలో ఉగ్రమూలాలు.. ముగ్గురు అరెస్ట్

image

AP: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో విజయవాడలో ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మొహ్మద్‌ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్‌ బేగ్, మొహ్మద్‌ డానిష్‌ అనే ఈ నిందితులు సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలంవైపు ఆకర్షిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు పది మంది దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌ నడిపిస్తున్నారని.. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News March 24, 2026

మతం మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు

image

క్రైస్తవంలోకి మారిన వెంటనే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మతం మారితే కుల సర్టిఫికెట్ రద్దు కాకపోయినా చట్టం వర్తించదని పేర్కొంది. సర్టిఫికెట్ ఉంది కాబట్టి రక్షణ కల్పించలేమంది. <<19463010>>పాస్టర్<<>> ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవంలో ఉన్నారని, తిరిగి మారలేదని తెలిపింది. SC కమ్యూనిటీలోకి తిరిగి చేర్చుకున్నారని నిరూపించుకుంటేనే పాత హోదా పునరుద్ధరణ సాధ్యమని తేల్చి చెప్పింది.