News August 23, 2024
కేసీఆర్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది: పొంగులేటి

TG: గత పదేళ్లలో రూ.11వేల కోట్లు కూడా మాఫీ చేయని BRSకు రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రైతులను మోసం చేసిందని ఆరోపించారు. తాము అలా కాదని, అర్హులైన అందరికీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. రూ.2లక్షల పైన రుణం ఉన్నవారు ఆపై మొత్తాన్ని చెల్లిస్తే రూ.2లక్షలు మాఫీ చేస్తామని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.
Similar News
News March 18, 2026
2028లో తెలంగాణలో ఎన్నికలు రావు: రేవంత్

TG: 2029లో దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వస్తాయని, 2028లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగవని CM రేవంత్ ఢిల్లీలో అన్నారు. అంతకంటే ముందే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే అని చెప్పారు. అటు మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల మేరకే TDP MP పుట్టా మహేశ్కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై దర్యాప్తు కోసం సిట్ను నియమించినట్లు మీడియా చిట్చాట్లో తెలిపారు.
News March 18, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News March 18, 2026
రానున్న 2-3గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.


