News August 23, 2024
మంచిర్యాల: అమాత్య యోగం ఎవరికో..?

MNCL: రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు చోటు దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సీట్లు కైవసం చేసుకుంది. దీంతో నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎమ్మెల్యేలు, వారి అనుచరగణం మంత్రి పదవి తమకే వస్తుందనే ధీమాతో ఉన్నారు. కష్టపడి పని చేసే వారికి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ క్యాడర్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తుంది.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్లో JOBS.. అప్లై NOW

ఆదిలాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాలు (KGBV), అనుబంధ మోడల్ స్కూళ్లలో బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టే ఈ నియామకాలకు స్థానిక మండలానికి చెందిన 18-45 ఏళ్ల వారు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా అర్హులు మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 12, 2025
ADB: పాఠశాల మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మంజూరైన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు సహా తరగతి గదుల మరమ్మత్తులపై చర్చించి, పనుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.
News November 11, 2025
సజావుగా సాగుతున్న పంటల కొనుగోళ్ల: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా, మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభమై కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వరి, పత్తి, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ రామకృష్ణారావు కలిసి నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో 11 పత్తి కొనుగోలు కేంద్రాలు, 33 జిన్నింగ్ మిల్లులు ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు.


