News August 23, 2024

ఏ రాష్ట్రంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయంటే?

image

దేశంలో ప్రతి ఊరుకో గుడి ఉండటం సహజం. అయితే, అత్యధికంగా గుళ్లు ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులో ఎక్కువగా 79,154 టెంపుల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 77,283, కర్ణాటకలో 61,232, వెస్ట్ బెంగాల్‌లో 53,658, గుజరాత్‌లో 49,995, ఆంధ్రప్రదేశ్‌లో 47,152, రాజస్థాన్‌లో 39,392, ఉత్తర్‌ప్రదేశ్‌లో 37,518, ఒడిశాలో 30,877, బిహార్‌లో 29,748, తెలంగాణలో 28,312, మధ్యప్రదేశ్‌లో 27,947 దేవాలయాలున్నాయి.

Similar News

News February 14, 2025

వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

News February 14, 2025

వంశీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

AP: వల్లభనేని <<15453734>>వంశీకి<<>> నేర చరిత్ర ఉందని, అతనిపై ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసును విత్ డ్రా చేసుకోవాలని వంశీ, అతని అనుచరులు సత్యవర్ధన్‌ను బెదిరించారని తెలిపారు. సత్యవర్ధన్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. వంశీకి బెయిల్ ఇవ్వొద్దని, రిమాండ్ విధించాలని కోరారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులు దొరకాల్సి ఉందన్నారు.

News February 14, 2025

రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

image

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్‌ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.

error: Content is protected !!