News August 24, 2024
సెంటు భూమి కూడా ఆక్రమణ కాకూడదు: విశాఖ కలెక్టర్

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ పరిరక్షణ జిల్లా స్థాయీ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆక్రమణ కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని 11 దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల ఈఓలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు.
News January 2, 2026
నేడు GVMC స్థాయీ సంఘం సమావేశం

GVMC స్థాయీ సంఘం సమావేశం నేడు జరగనుంది. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన ఉదయం GVMC ప్రధాన కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి 87 అంశాలతో అజెండాను అధికారులు రూపొందించారు. IPRతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. గత సమావేశంలో వివాదాస్పదంగా మారిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు అంశం ఈసారి మళ్లీ అజెండాలో ఉండటంతో దానికి ఆమోదం లభిస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.
News January 2, 2026
మరో మ్యాచ్కు సిద్ధమవుతున్న విశాఖ

విశాఖలో ఈనెల 28న మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే నాలుగో టీ20 మ్యాచ్కు మధురవాడలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా విశాఖకు టీ20 మ్యాచ్ రావడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.


