News August 24, 2024
భారత్కంటే అఫ్గాన్ సురక్షితమేమో.. అర్షద్ ట్వీట్ వైరల్!
రెబల్స్టార్ ప్రభాస్పై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీని సినీ అభిమానులు వదలడం లేదు. 2012లో ఆయన చేసిన ట్వీట్ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ‘రేపు ఉదయం అఫ్గాన్ అధ్యక్షుడిని మీట్ అవుతున్నా. నేను ఆ దేశానికి షిఫ్ట్ అయితే బెటరేమో. భారత్ కంటే అక్కడే సురక్షితం’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో అర్జంట్గా అఫ్గాన్ షిఫ్ట్ అయిపో అంటూ నెటిజన్లు ఆ పోస్టు కింద కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News September 18, 2024
వంట నూనెల ధరలు పెంచొద్దన్న కేంద్రం
వంట నూనెల ధరలను పెంచొద్దని సంబంధిత సంస్థలను కేంద్రం ఆదేశించింది. తక్కువ సుంకానికి దిగుమతి చేసుకున్న వంట నూనెల స్టాక్ దాదాపు 30 లక్షల టన్నులు ఉందని తెలిపింది. ఇది 45-50 రోజులకు సరిపోతాయంది. కాగా అధిక దిగుమతులతో నూనె గింజల ధరలు దేశీయంగా పడిపోతుండటంతో కేంద్రం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతో ధరలు పెరుగుతాయన్న వాదనలు వినిపిస్తుండటంతో పరిశ్రమ వర్గాలతో కేంద్రం సమావేశమై సూచనలు చేసింది.
News September 18, 2024
Learning English: Synonyms
✒ Do: Execute, Enact, Finish
✒ Dull: Lifeless, Tedious, Tiresome
✒ Eager: Keen, Fervent, Involved
✒ End: Stop, Finish, Terminate
✒ Enjoy: Appreciate, Delight In,
✒ Explain: Clarify, Define, Interpret
✒ Fair: Impartial, Unbiased, Objective
✒ Fall: Drop, Plunge, Topple
✒ False: Fake, Fraudulent, Counterfeit
News September 18, 2024
కస్టమ్ డ్యూటీ తగ్గింపు.. భారీగా పెరిగిన గోల్డ్ దిగుమతులు
గోల్డ్పై కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 6 శాతానికి తగ్గించడంతో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. గత ఏడాది AUGలో $4.83 బిలియన్ల విలువైన పసిడిని భారత్ ఇంపోర్ట్ చేసుకోగా, ఈ ఏడాది ఆగస్టులో ఆ మొత్తం $10.6 బిలియన్లకు పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ భారీగా తగ్గినట్లు తెలిపింది. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, దక్షిణాఫ్రికా నుంచి 10% దిగుమతులు ఉన్నాయి.