News August 24, 2024

కావలి: ఆర్టీసీలో రూ.10 నాణెం చెల్లుతుంది

image

నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ రూ.10 కాయిన్‌ను కొన్ని చోట్ల తీసుకోవడం లేదు. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ వీటిని తీసుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు స్పందించారు. ‘ఆర్టీసీలో రూ.10 కాయిన్ చెల్లుతుంది. ప్రయాణికులు ఇచ్చే కాయిన్ తీసుకోవాల్సిందేనని సిబ్బందికి ప్రత్యేకంగా చెప్పాం. రూ.10 కాయిన్ చెల్లుతుందని బస్టాండ్ ఆవరణలో నోటీసు బోర్డు పెట్టాం’ అని తెలిపారు.

Similar News

News March 16, 2026

నెల్లూరు : మరి కాసేపట్లో మొదలుకానున్న పది పరీక్షలు

image

10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 174 కేంద్రాలలో 28,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 24 సిట్టింగ్ స్క్వార్డులు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షల్లో సమస్యలు ఎదురైతే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

News March 16, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

పొదలకూరు మండలం మరుపూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ (14) అనే బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి వెళ్లి పాత తాగునీటి బావిలో మునిగి మృతి చెందాడు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో డైవింగ్ చేసిన తర్వాత పైకి రాకపోవడంతో గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

News March 15, 2026

నెల్లూరులో ఘనంగా జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు

image

నెల్లూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. కలెక్టర్ హిమాంత్ శుక్లా, MLC బీద రవిచంద్ర, MLAలు కోటంరెడ్డి, సోమిరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వీరు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.