News August 24, 2024

శ్రీకాకుళం జిల్లాకు రూ.36.45 కోట్లు

image

జిల్లాలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36.45 కోట్లు విడుదలయ్యాయి. 30 మండలాల పరిధిలోని 896 గ్రామ పంచాయతీలకు 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత కింద ఈ నిధులు మంజూరయ్యాయి. వీటితో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ ఖాతాలకు నిధులు జమ చేశామని ఇన్‌ఛార్జి డీపీవో ఆర్ వెంకట్రామన్ తెలిపారు.

Similar News

News March 11, 2026

SKLM: ‘ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ కెవి రమణ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండేవలసలో ఉన్న పోలీస్ శిక్షణకేంద్రంలో ఆర్మడు రిజర్వుడ్ పోలీసులకు 14 రోజులుపాటు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని వ్యక్తిగత క్రమశిక్షణ పాటిస్తూ జిల్లా పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. చివరికీ

image

శ్రీకాకుళం జిల్లాతో పాటు, పలు ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా బీబీనగర్‌కు చెందిన గొల్ల బెనర్జీ పలు చోట్ల ఉద్యోగాల పేరుతో రూ.1.05 కోట్లు వసూలు చేశాడన్నారు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామన్నారు.

News March 10, 2026

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌పై ACB అదికారుల దాడి

image

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో ACB అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ACB సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రావుతో కూడిన బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్ సంబంధించిన ఫైళ్లను, ఈ ఆఫీస్ ఫైళ్లను పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ శాఖలో అవినీతి ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో ఏసీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫిర్యాదుల మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు.