News August 24, 2024

సిద్దవటం: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

సిద్దవటం మండలంలోని భాకరాపేట రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి, గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మృతుని వద్ద ఉన్న పర్సులో చరవాణి నంబర్లు బద్వేల్ ప్రాంతానికి చెందిన వారివిగా తేలాయని ఎస్ఐ చెప్పారు.

Similar News

News March 4, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,512 మంది హాజరు.!

image

కడప జిల్లాలో బుధవారం 62 సెంటర్లలో 2nd ఇంటర్ మ్యాథమాటిక్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించారు. 12,888 మంది విద్యార్థులకు గాను.. 12,512 మంది పరీక్షలు రాశారు. 375 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 11,738 మందికి గాను.. 11,427 మంది విద్యార్థులు హాజరయ్యారు. 311 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,150 మందికి గాను.. 1,085 మంది పరీక్షలు రాశారు. 65 మంది ఆబ్సెంట్ అయ్యారు.

News March 4, 2026

మైదుకూరు: నోటికాడి ఆహారాన్ని కూడా వదలరా.?

image

కడప జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిన్న రాత్రి మైదుకూరులో దాడులు చేసి పీడీఎస్‌కు చెందిన 57 బస్తాల బియ్యం, 91 బస్తాల జొన్నలు, 6 బస్తాల రాగులు పట్టుకున్నారు. ప్రభుత్వ రేషన్ దుకాణాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం, అంగన్వాడీలు, సంక్షేమ హాస్టళ్ల ముద్ర కలిగిన గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. చివరికి అక్రమార్కులు బడి పిల్లలు, పసి పిల్లల అన్నాన్ని సైతం వదలకుండా అమ్ముకుంటున్నారు.

News March 4, 2026

ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ASP

image

మాజీ సీఎం YS జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం YS జగన్ పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంగళవారం ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్‌తో కలిసి ASP తనిఖీ చేశారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రొద్దుటూరుకు YS జగన్ వస్తున్నారు.