News August 24, 2024

భవన నిర్మాణ కార్మికులను జగన్ వేధించారు: మంత్రి సుభాష్

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదాన్ని జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి సుభాష్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులను ఆయన వేధించారని, వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పారిశ్రామిక ప్రమాదాల్లో సిబ్బంది మరణించినప్పుడు CM హోదాలో జగన్ ఎప్పుడూ పరామర్శకు రాలేదని దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కార్మికుల బాగోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Similar News

News March 22, 2026

కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం: CBN

image

1999-2004 మధ్య హైదరాబాద్‌ను శరవేగంగా అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. HYD ISBలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014-19 వరకు APలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని తెలిపారు.

News March 22, 2026

ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

image

వేసవిలో శరీర చల్లదనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటాయి. దీంతో టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంతాలు పుచ్చిపోవడం, ఆస్టియోపోరోసిస్, నిద్ర లేమి, డీహైడ్రేషన్, గుండె సమస్యలు రావొచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, పండ్లు, కూరగాయల స్మూతీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.
#ShareIt

News March 22, 2026

‘నలభీమ పాకం’ అర్థం ఏమిటి?

image

మగవాళ్లు అత్యంత రుచికరమైన వంటకం చేసినప్పుడు ‘నలభీమ పాకం’ జాతీయాన్ని ఉపయోగిస్తారు. భారతంలో దమయంతి భర్త నలుడు. జూద వ్యసనంతో నిషాధ రాజ్యాన్ని కోల్పోయి బుషపర్ణుడి వద్ద వంటవాడిగా చేరి అద్భుతమైన వంటలు చేసేవారు. పాండవుల అజ్ఞాతవాసంలో విరాటరాజు దగ్గర భీముడు వంట పనిచేసేవారు. వీరిద్దరి పనిని కవులు నలభీమ పాకంగా అభివర్ణించారు. మీలో ఎవరైనా రుచికరమైన వంటలు చేసేవారున్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>