News August 24, 2024
HYD: రూ.1.15 కోట్ల చెక్కు అందజేత

ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థ అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరెంట్షాక్తో మరణించిన వరంగల్-2 డిపోకు చెందిన డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబసభ్యులకు రూ.1.15 కోట్ల విలువగల ప్రమాద బీమా చెక్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం బాగ్ లింగంపల్లిలో అందజేశారు. కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ.సజ్జనర్, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ అరుణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 7, 2025
HYD సైబర్ క్రైమ్ దుమ్మురేపే ఆపరేషన్

HYD సైబర్ క్రైమ్ పోలీసులు అక్టోబర్ ఆపరేషన్లో భారీ దందాలు ఛేదించారు. మొత్తం 196 కేసులు, 55 అరెస్టులు, ₹62 లక్షల రిఫండ్ చేశారు. డిజిటల్ అరెస్ట్లు, ఇన్వెస్ట్మెంట్ & ట్రేడింగ్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా మోసాల్లో దేశంలోని 8 రాష్ట్రాల నుంచి నిందితులు పట్టుబడ్డారు. సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో రూ.107 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. మరిన్ని కేసుల్లో రూ.లక్షల్లో రిఫండ్ చేశారు.
News November 7, 2025
HYD: వారంలో కూతురి పెళ్లి.. ఇంతలోనే విషాదం..!

జనగామ(D) బచ్చన్నపేట(M) ఆలీంపూర్లో రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD ECILలోని ఆర్టీవన్ కాలనీ వాసి బండి శ్రీనివాస్(50) తన కూతురిని సిద్దిపేట(D) కొండపాక(M) వెలికట్టెకు చెందిన ఓయువకుడికి ఇచ్చి ఈనెల 13న పెళ్లి చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చేర్యాల(M) ముస్త్యాలలో బంధువులకు పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తుండగా బైక్, DCM ఎదురెదురుగా ఢీకొనగా శ్రీనివాస్ మరణించాడు.
News November 7, 2025
జూబ్లిహిల్స్ బైపోల్స్: సమయం లేదు మిత్రమా.. !

ప్రచారానికి గడవు ఈరోజుతోపాటు ఉన్నది మూడు రోజులే.. అంతే.. అదీ ఆదివారం సాయంత్రానికి క్లోజ్.. అందుకే నాయకులు నిద్రపోవడం లేదు. రాత్రి వరకు ప్రచారం చేసి రాత్రి వేళ స్థానిక నాయకులతో మంతనాలు.. ఏ ఓటు ఎవరికి వచ్చే అవకాశం.. మనకెన్ని ఓట్లు వస్తాయనే విషయంపైనే సమాలోచనలు.. ఓటు మనకు రాకపోతే ఎలా రాబట్టుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ మూడు రోజులను పక్కాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.


