News August 25, 2024
పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు అరుదైన అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా 11 నగరాల్లో పచ్చదనం పెంపొందించే దిశగా ఆయా నగరాల్లో వనాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ జాబితాలో కాశీబుగ్గకు చోటు దక్కడంతో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ప్రకటించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 11, 2026
కోటబొమ్మాళి: భర్తపై భార్య దాడి

భర్తపై భార్య దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోటబొమ్మాళి మండలం మంచాలపేటలో జరిగింది. భర్తను సోదరిడితో కలిసి ఓ గదిలో బంధించి కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గమనించిన కుటుంబీకులు తక్షణం సమీప ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 11, 2026
శ్రీకాకుళం పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 11, 2026
ఎచ్చెర్ల: రిజల్ట్స్ విడుదల

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ అనురాధ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆమె వెల్లడించారు. https://brau.edu.in/ వెబ్సైట్ను విద్యార్థులు చూడాలని పేర్కొన్నారు.


