News August 25, 2024
ప్రకాశం జిల్లా అభివృద్ధికి కార్యాచరణ: కలెక్టర్

వచ్చే అయిదేళ్లకు గాను జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ఒంగోలు ప్రకాశం భవన్లో జిల్లా ఉన్నతాధికారులతో ఆమె శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాల సాధనతో పాటు, వినూత్నంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్, జడ్పీ సీఈవో మాధురి పాల్గొన్నారు.
Similar News
News March 15, 2026
ప్రకాశం: పాలేరు వాగులో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలోని పాలేరు వాగులో దొరికిన <<19383562>>మృతదేహంపై <<>>పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండటంతో పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. మృతుడి ఆనవాళ్ల కోసం సోషల్ మీడియాలో ఫొటోలు ఉంచడంతో పాటు పక్క జిల్లాల పోలీస్ స్టేషన్లకు సమాచారం పంపినట్లు ఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఎవరైనా అదృశ్యమైన వ్యక్తుల వివరాలు ఉంటే తక్షణమే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
News March 15, 2026
అలర్ట్.. ‘జిల్లాలో అక్కడ 144 సెక్షన్’

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు మూసి వేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు తప్ప ఇతర సిబ్బంది ఎవరూ ఉండకూడదని అన్నారు. పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
News March 15, 2026
ప్రకాశం: 7th క్లాస్ బాలికతో 9th క్లాస్ బాలుడికి పెళ్లి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు ఒంగోలులోని ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్కు తరలించాలని ఆదేశించారు.


